వైఎస్ షర్మిల, విజయలక్ష్మి కేసు విత్ డ్రా..?
వైఎస్ షర్మిళ, వైఎస్ విజయమ్మలపై పరకాల కేసును ఉపసంహరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరకాలలో 2012 అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని వీరిద్దరిపై అభియోగం మోపారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విజయమ్మ, షర్మిళ, కొండా సురేఖ, కొండా మురళీపై విచారణ చేశారు. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ పిటిషన్ వేయనున్నట్లు పీపీ కోర్టుకు తెలిపారు.
సంబంధిత అధికారుల ఉత్తర్వుల కోసం రావాల్సి ఉందని మెమో దాఖలు చేశారు. కేసును ఎక్కువ రోజులు వాయిదా వేయలేమని ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టం చేసింది. విజయమ్మ, షర్మిళపై మాత్రమే కేసు ఉపసంహరించే ఉద్దేశం కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్సి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 31న విజయమ్మ, షర్మిళ సహా నిందితులందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో కేసు వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇటు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ అంటూ హడావిడి చేస్తున్నారు. ఆమెతో ఒక్కొక్కరు చేరుతున్నారు కూడా. ఈ క్రమంలో కేసు విత్ డ్రా కావడం వారికి కలిసొచ్చే అంశమే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications