పేదలకు 10శాతం రిజర్వేషన్ బిల్లు: సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన యూత్ ఫర్ ఈక్విటీ
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ బిల్లు సుప్రీం కోర్టుకు చేరింది. జనరల్ కేటగిరీలో పేదలకు రిజర్వేషన్లు ఇస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. యూత్ ఫర్ ఈక్విటీ అనే సంస్థ, కౌషల్ కాంత్ మిశ్రాలు పిటిషన్ దాఖలు చేశారు.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం తీసుకు వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లు చట్ట రూపం దాల్చుతుంది.

ఇలాంటి సమయంలో ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ బిల్లు వల్ల దేశంలో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు రెండు రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. మంగళవారం లోకసభలో ఆమోదం పొందగా, బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కొందరు అభిప్రాయపడినా చివరకు ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి అందరూ అనుకూలంగా ఓటు వేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications