పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్ప్రెస్: 100 మందికి గాయాలు
చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో మట్టంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బెంగుళూరు నుంచి కన్యాకుమారికి వెళుతోన్న ఐలాండ్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్:16526) మట్టంపల్లి స్టేషన్కు సమీపంలో పట్టాలు తప్పింది.
మొత్తం నాలుగు బోగీలు పట్టాలు నుంచ విడిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది రంగంలోకి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటన గురించి తెలుసుకోవడానికి హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.
help line numbers in TVC @swrbengaluru @DrmChennai @SalemDRM pic.twitter.com/4kr1fQU8wi
— DRM Trivandrum (@TVC138) February 5, 2016
Kanniyakumari–Bangalore Express derailed between Somanayakanpatti & Patchur (TN) in early morning hours. pic.twitter.com/yZaVXK1UVd
— ANI (@ANI_news) February 5, 2016