యమునోత్రి హైవేపై చిక్కుకున్న 10 వేల మంది జనం-రక్షణ గోడ కూలి రోడ్డు బ్లాక్ కావడంతో
ఉత్తరాఖండ్ లోని యమనోత్రి రహదారిపై కొండచరియలు పడకుండా నిర్మించిన రక్షణ గోడ కూలిన ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 10 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ రహదారిపై చిక్కుకుపోయారు. కూలిన రక్షణ గోడ తొలగిస్తే కానీ వారిని కాపాడలేని పరిస్ధితులు నెలకొన్నాయి.దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
యమునోత్రి ఆలయానికి వెళ్లే హైవే భద్రతా గోడ కూలిపోవడంతో దాదాపు 10,000 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. దీని కారణంగా, రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే ఈ 10,000 మంది ప్రజలు హైవే వెంబడి వివిధ ప్రదేశాలలో చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యల తర్వాత ఈ రహదారి మళ్లీ తెరవడానికి 3 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తునారు. జిల్లా యంత్రాంగం కొన్ని చిన్న వాహనాల నుంచి ప్రయాణికులను తరలించేందుకు యత్నిస్తుండగా దూరప్రాంతాల నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన వారు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

యమునోత్రి ఆలయానికి వెళ్లేందుకు బయలుదేరిన ప్రయాణికులే ఇందులో పెద్ద మొత్తంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వీరంతా ఆలయానికి వెళ్తుండగా యమునోత్రి హైవేపై రక్షణ గోడ కూలిపోయింది. దీంతో దర్శనానికి సైతం వెళ్లలేని పరిస్ధితుల్లో చాలా మంది రహదారిపై చిక్కుపోయారు. వీరిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నా అక్కడ ప్రతికూల పరిస్ధితులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలు కూడా వేగంగా చేపట్టలేని పరిస్ధితి ఉంది. రక్షణ గోడ శిధిలాల తొలగింపు పూర్తయితే కానీ యాత్రికుల వాహనాలు వెళ్లలేని పరిస్ధితి.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications