Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ గంటకు ఛార్జ్ చేసేది ఎన్ని కోట్లో తెలుసా ? తొలిసారి..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే విజయం, మోడీ ప్రధాని కావడంతో తొలిసారి రాజకీయ వ్యూహకర్తగా అందరికీ పరిచయమైన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీతో పాటు పలువురు రాజకీయ నేతలకు అధికారాన్ని అందించారు. అయితే తన రాజకీయ వ్యూహాలతో వీరిని అధికారంలోకి తెచ్చేందుకు తాను ఎంత తీసుకున్నాననేది మాత్రం ఆయన ఎప్పుడూ బయటపెట్టలేదు. దీంతో ఎవరికి వారు ఆయన ఫీజుపై లెక్కలు వేసుకున్నారు.
అయితే తొలిసారి ఇవాళ ప్రశాంత్ కిషోర్ తాను రాజకీయ వ్యూహాలు అందించినందుకు రాజకీయ పార్టీల నుంచి ఎంత భారీ మొత్తంలో ఫీజు తీసుకుంటారో బహిరంగంగా వెల్లడించారు. కొంతకాలంగా రాజకీయ వ్యూహాలకు బ్రేక్ ఇచ్చేసి బీహార్ లో జన్ సురాజ్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చేందుకు రెండు గంటలకు 11 కోట్ల ఫీజు వసూలు చేస్తానని వెల్లడించారు. అంటే గంటకు 5.5 కోట్లు అన్న మాట.

VIDEO | Jan Suraaj founder Prashant Kishor says, “Took Rs 11 crore for two hours’ advice, this is the power of a boy from Bihar," as he refutes allegations that his party donations came from shell companies.
— Press Trust of India (@PTI_News) September 29, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/yvkI0ILdWe
బీహార్ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీకి షెల్ కంపెనీల నుంచి నిధులు అందుతున్నాయన్న విమర్శలపై ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. తాను రెండు గంటలు సలహాలు ఇచ్చి 11 కోట్లు తీసుకున్నానని, అదీ ఈ బీహార్ కుర్రాడి సత్తా అన్నారు. తన వృత్తిపరమైన సేవలకు వచ్చిన ఫీజుకు జీఎస్టీ, ఐటీ చెల్లించి మరీ తన పార్టీకి ఇచ్చినట్లు పీకే వెల్లడించారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని ఆయన తేల్చిచెప్పేశారు. ఇప్పటికే పీకే పార్టీని కాంగ్రెస్-ఆర్జేడీ కూటమితో పాటు అధికార బీజేపీ-జేడీయూ కూటమి కూడా టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనకు వచ్చిన నిధులపై వివరణ ఇచ్చారు.
-
విద్యార్థులకు షాక్: భారీగా పెరిగిన ఫీజులు -
తెలంగాణలో బీఈ/బీటెక్ విద్యార్థులకు భారీ ఊరట- నోటిఫికేషన్కు ఆమోదం -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్












Click it and Unblock the Notifications