ఎన్నికల వేళ మరో భారీ ఎన్కౌంటర్: 12 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ (Bijapur) జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. దీంతో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజాగా ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఘటనా స్థలం నుంచి ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. స్థానికంగా గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
కాగా, ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విధితమే. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఏప్రిల్ 30న నారాయణ్ పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మరో ఎదురుకాల్పుల ఘటనలో 10 మంది మరణించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications