Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో దిపావళి బాణాసంచా గౌడన్ లో పేలుడు, 12 మంది సజీవదహనం !

బెంగళూరు/హోసూరు: దీపావళి (diwali) పండుగ సమీపిస్తున్న సమయంలో టపాకాయలు (బాణాసంచా) వ్యాపారం జోరందుకుంది. బెంగళూరు (Bengaluru) గ్రామీణ జిల్లాలోని అనేకల్ తాలూకా అత్తిబెలెలో ( border) ఓ బాణసంచా దుకాణంలో ప్రమాదవశాత్తు (fireworks) మంటలు చెలరేగడంతో సుమారు 40 మందికిపైగా కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో శనివారం రాత్రి 8 గంటలకు 12 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

ఈ అగ్నిప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు (Bengaluru) గ్రామీణ జిల్లా అనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. నవీన్‌ అనే బాణాసంచాల వ్యాపారికి చెందిన టపాకాయల దుకాణం గౌడన్ లో (fireworks)ప్రమాదం జరగడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చెయ్యడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

12 people were burnt alive in a firework gaudan fire in Atthibele on the outskirts of Bengaluru.

అగ్నిప్రమాదంలో ఎంత మంది కార్మికులు మరణించారనే దానిపై ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదని స్థానికులు అంటున్నారు. అయితే ఇప్పటికే 12 మంది సజీవదహనం అయ్యారని అధికారులు (Bengaluru)అంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడటంతో అక్కడి నుంచి వారిని పంపించడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, బాణాసంచా దుకాణం (fireworks) దగ్గరకు చేరుకున్న అంబులెన్స్‌ల్లో గాయపడిన వారిని వివిద ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను (Bengaluru)బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. బాణసంచా గౌడన్ లో (fireworks) సుమారు నాలుగు గంటలుగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు హడలిపోయారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఐదు, ఆరు అగ్నిమాపక వాహనాలు, పదుల సంఖ్యలో సిబ్బంది మంటలను ( border) ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నవీన్‌కు చెందిన ఈ గౌడన్ లో దాదాపు రూ. ఐదు కోట్ల విలువైన టపాకాయలు నిల్వ చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని సమాచారం.

బాణాసంచా గౌడన్ లో (fireworks) జరిగిన అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. బాణసంచా ( border) దుకాణంలో సుమారు 40 మంది పనిచేస్తున్నారని, గౌడన్ వెనుక డోర్ నుంచి బయటకు రావడంతో కొంత మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు అంటున్నారు. ఈ గౌడన్ లో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు నుంచి (diwali) లారీల్లో టపాకాయల స్టాక్ తీసుకు వచ్చి గౌడన్ లో నిల్వ చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు, నాలుగు ద్విచక్ర వాహనాలు (fireworks) దగ్ధమయ్యాయని పోలీసులు అంటున్నారు. ఆ ప్రాంతంలో (Bengaluru)టపాకాయలు పేలుతూనే ఉన్నాయని పోలీసులు అన్నారు.

దట్టమైన మంటలతో పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బాణసంచా (fireworks) దుకాణంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు వస్తూనే ఉన్నాయి, బెంగళూరు (Bengaluru)- హోసూరు జాతీయ రహదారి 44 సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్థం అయ్యింది. దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో కర్ణాటక- తమిళనాడు ( border) సరిహద్దులో ఈ ప్రమాదం (diwali) జరగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+