గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది మృతి, కూలిపనుల కోసం వెళ్లి పైలోకాలకు !
గుజరాత్ లోని ఖోడా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ లోని ఖోడా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. గుజరాత్ లోని అహమ్మదాబాద్-ఇండోర్ జాతీయ రహదారిలో మంగళవారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది.
మధ్యప్రదేశ్ లోని సేజేబాడ గ్రామంలో నివాసం ఉంటున్నవారు కూలి పనులు చెయ్యడానికి గుజరాత్ వెళ్లారు. మంగళవారం వేకువ జామున అందరూ తుపాన్ వాహనం (జీపు)లో బయలుదేరారు. మార్గం మధ్యలో కేదల్ జిల్లాలోని కతలాల్ ప్రాంతంలో తుపాన్ జీపు అదుపుతప్పింది.

వేగంగా వెళ్లిన తుపాన్ జీపు ముందు వెలుతున్న ట్రక్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ తో సహ 13 మంది దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలైన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా జీపు నడపడం వలనే ప్రమాదం జరిగిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications