వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సముద్రంలో మునిగి 13మంది విద్యార్థుల మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం వెళ్లిన పుణెకు చెందిన విద్యార్థులు సముద్రంలో మునిగిపోయారు. ముంబైలోని మురద్ బీచ్కు వెళ్లిన విద్యార్థులు సముద్రం ఒడ్డున ఆడుకుంటుండగా మృత్యువు అలలరూపంలో వచ్చి వారి ప్రాణాలు తోడేశాయి.
ఈ ఘటనలో మొత్తం 13మంది విద్యార్థులు మృతి చెందారు. వీరిలో 10మంది బాలురు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కాగా, విహార యాత్రకు మొత్తం 130మంది విద్యార్థులు పుణె నుంచి ఇక్కడికి వచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. కొందరు విద్యార్థులను స్థానికులు కాపాడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
English summary
At least 13 college students, including three girls, have drowned in the Arabian Sea at Murud in Raigad district, around 150 kms south of Mumbai, officials said on Monday.