Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘోర ప్రమాదం: పడవ బోల్తా పడి 15 మంది మృతి, ప్రధాని మోడీ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

తిరువనంతపురం: కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పలువురు పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో అందులోని 15 మంది మరణించారు. ఈ విషాద ఘటన మలప్పురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

మలప్పురం జిల్లా తానూర్‌లోని తూవల్ తీరం టూరిస్ట్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఆరుగురిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Malappuram

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన ప్రతి ఒక్క మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పిఎంఓ ట్వీట్‌లో పేర్కొంది.

కేరళ టూరిజం మంత్రి మహమ్మద్ రియాస్ ఘటనా స్థలానికి కోజికోడ్‌ నుంచి బయలుదేరినట్లు సమాచారం. స్థానికులు, పోలీసు అధికారులు, రెవెన్యూ యూనిట్లు, అగ్నిమాపక శాఖ సహాయక చర్యలు చేపట్టింది. రెస్క్యూ, సెర్చ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా, కనీసం పది మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

కాగా, గత నెలలోనే కేరళలో తొలి ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారని.. అప్పట్నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో బోటు షికార్లకు వెళుతున్నారు. విహార యాత్రల బోటింగ్ లకు కేవలం సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉందని, అయితే, దీన్ని పట్టించుకోకుండా రాత్రిపూట కూడా కొన్ని బోట్ల సంచరిస్తున్నాయని తనూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ముస్తాఫా తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+