వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో మోడీ తొలి అడుగు, సోనియాకి నమస్కరించి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పదహారవ లోకసభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న కమల్ నాథ్ వ్యవహరించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండేకు లోకసభ నివాళులు అర్పించింది. సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి పార్లమెంటుకు హాజరయ్యారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించక ముందు లోకసభకు గతంలో ఎప్పుడు ప్రాతినిథ్యం వహించలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది.

16th Lok Sabha session begins

ఎన్నికల్లో బిజెపి గెలిచాక ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. గత నెలలో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోకసభకు హాజరయ్యారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సభకు హాజరయ్యారు. లోకసభలో తనకు ఎదురుపడిన సోనియాకు ప్రధాని మోడీ నమస్కరించి... పలకరించారు. మోడీకి సోనియా, ములాయం సహా అన్ని పార్టీల నేతలు అభినందనలు తెలిపారు.

అంతకుముందు ప్రొటెం స్పీకర్‌గా లోకసభలో అత్యంత సీనియర్ సభ్యుడైన కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు.

English summary
Lok Sabha session begins, 2 minute silence observed to pay homage to Gopinath Munde.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X