పని మనిషిపై రెండ్రోజులపాటు సామూహిక అత్యాచారం

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు. కాగా, పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన గదిలోనే ఉండే షమ్మఖుతన్.. సిర్సాలోని ఓ ఇంటికి పని మనిషి అవసరం ఉందని, అక్కడికి వెళ్లాలని కోరడంతో మే 31న సిర్సాకు బయల్దేరినట్లు బాధితురాలు తెలిపింది.
ఆ రోజు రాత్రి సిర్సా బస్టాండ్ చేరుకున్న తనను, ఇద్దరు యువకులు తమ కారులో బలవంతంగా ఎక్కించుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత కూడా ఓ గదిలో బంధించి రెండు రోజులపాటు తనను సామూహిక అత్యాచారం చేశారని చెప్పింది.
సోమవారం రాత్రి తనను నథుసరి చోప్టా గ్రామం సమీపంలోకి తీసుకెళ్లడంతో సహాయం కోసం అరిచినట్లు ఆమె తెలిపింది. దీంతో భయానికి గురైన నిందితులు తనను అక్కడే విడిచిపెట్టి పరారైనట్లు బాధితురాలు చెప్పింది. స్థానికుల సహాయంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. బాధిత యువతి అత్యాచారానికి గురైనట్లు మెడికల్ రిపోర్టులో తేలిందని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications