వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18వ రోజు నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు ... స్థిరంగా చమురు ధరలు ఉన్న కారణం ఇదేనా !!

|
Google Oneindia TeluguNews

18 వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తుంది. విపరీతంగా పెట్రోల్ ,డీజిల్ ధరలు పెరగడం పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గత 18 రోజులుగా పెట్రోల్, డీజిల్ లకు పెంచిన ధర స్థిరంగా కొనసాగుతోంది . దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం పెట్రోల్ , డీజిల్ ధరలు నిలకడగా కొనసాగడం ప్రధానంగా కనిపిస్తుంది

ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఆ పని చేస్తే ప్రోత్సాహకాలు కూడా .. మరో బాంబు పేల్చిన కేంద్రం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఆ పని చేస్తే ప్రోత్సాహకాలు కూడా .. మరో బాంబు పేల్చిన కేంద్రం

ఫిబ్రవరి 27 న చివరిసారిగా ధరలు పెరిగాయి. అప్పటికే ఆందోళనలు , ప్రతిపక్షాల ఆగ్రహావేశాలు కొనసాగటంతో పాటు వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. అప్పటి నుండి, న్యూఢిల్లీలో పెట్రోల్ మరియు డీజిల్ ధర లీటరుకు 91.17 రూపాయలు మరియు లీటరుకు 81.47 రూపాయలుగా ఉందని, ధరల్లో ఎలాంటి మార్పు మారలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది.

18th day petrol and diesel prices remained steady.. Is this the reason for the stable fuel prices?

అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం, కేంద్ర, రాష్ట్ర పన్నులు అధికంగా ఉండటం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .19.98నుంచి రూ . 39.98 కు పెంచింది. డీజిల్‌పై కూడా ఇదే విధమైన పెరుగుదల ఉంది, ఇక్కడ ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .15.83 నుండి రూ .31.83 కు పెంచారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే కాలంలో ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ను పెంచాయి.

పెట్రోల్ మరియు డీజిల్ రిటైల్ ధరలు ఫిబ్రవరిలో రాజస్థాన్ యొక్క శ్రీ గంగానగర్ మరియు మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ లలో మూడు అంకెలను అధిగమించినట్లు తెలుస్తోంది. దేశంలో అత్యధిక విలువ ఆధారిత పన్నును రాజస్థాన్ తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రాలు విధించడంతో పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలకు పైగా పెరిగాయి. సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించడానికి వస్తువుల, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి ఇంధనాన్ని చేర్చాలని ప్రజలనుంచి విజ్ఞప్తులు వెల్లువ గా మారాయి .

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అలాంటిదేమీ ఉండబోదని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ .93.11, రూ .86.45 గా ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ .91.35, లీటరుకు రూ .84.35 గా ఉంది.
ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 97.57 రూపాయలు. డీజిల్ ధర లీటరుకు రూ .88.60 గా ఉంది.

English summary
Petrol and diesel prices remained steady for the eighteenth consecutive day on March 17, 2o21, across the country after a steep rise when the prices were last hiked on February 27. Since then, the price of petrol and diesel in new Delhi remained unchanged at Rs 91.17 per litre and Rs 81.47 per litre, respectively, according to the Indian Oil Corporation Limited (IOCL). In Mumbai, the price of petrol is Rs 97.57 per litre. The price of diesel stood at Rs 88.60 per litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X