కలకలం రేపుతోన్న మరో దిశ ఘటన.. టోల్ ప్లాజా సమీపంలో యువతిపై అత్యాచారం..
హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో దిశ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను ఇంకా మరవకముందే హర్యానాలో మరో దిశ తరహా ఘటన చోటు చేసుకుంది. కర్నల్ జిల్లాలోని ఓ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఓ మహిళను అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మధుబన్ పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి పానిపట్ నుంచి తన భర్తతో కలిసి ఆ యువతి(19) బస్సులో తమ ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఓ బంధువును కలిసేందుకు టోల్ ప్లాజా వద్ద దిగారు. ఆ సమయంలో రోడ్డు పక్కనున్న ఓ టీ స్టాల్ వద్ద టీ తాగేందుకు ఆమె భర్త వెళ్లగా.. సమీపంలో ఉన్న ఓ టాయిలెట్ వద్దకు ఆ యువతి వెళ్లింది. ఆమె టాయిలెట్ వెళ్లడాన్ని గమనించిన ఇద్దరు దుండగులు.. కత్తులతో బెదిరించి ఆమెను కిడ్నాప్ చేశారు.

అనంతరం టోల్ ప్లాజా సమీపంలోని కుతైల్ అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపారు. ఆపై అక్కడినుంచి పారిపోయారు. ఘటన తర్వాత బాధితురాలు భర్తతో కలిసి మధుబన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సింగ్ అనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications