1993 ముంబై పేలుళ్ల కీలకపాత్ర పోషించిన ముస్తఫా మృతి
1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న ముస్తఫా దోసా బుధవారం మధ్యాహ్నం గం.2.30 మృతి చెందాడు. అతను గుండెపోటు వల్ల చనిపోయాడు.
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న ముస్తఫా దోసా బుధవారం మధ్యాహ్నం గం.2.30 మృతి చెందాడు. అతను గుండెపోటు వల్ల చనిపోయాడు.
ముంబై వరుస పేలుళ్ల కేసులో ముస్తఫా దోసా దోషిగా తేలాడు. ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న ముస్తఫాకు బుధవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది.

దీంతో జైలు అధికారులు జేజే ఆస్పత్రికి తరలించారు. ముస్తఫా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. ఇది వరకే ముస్తఫాకు అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి ఉన్నాయని ఆసుపత్రి డీన్ టీపీ లహానే చెప్పారు.
1993 మార్చిలో జరిగిన ముంబై వరుస పేలుళ్లలో 257 మంది మృత్యువాత పడ్డారు. ఆ పేలుళ్లలో ముస్తఫా కీలకపాత్ర పోషించాడని, అతనికి మరణశిక్ష విధించాలని సిబిఐ మంగళవారం న్యాయస్థానాన్ని కోరింది.












Click it and Unblock the Notifications