2.6 లక్షల మందికి ఇంటర్నెట్ లేదు, ఆన్లైన్ తరగతులు ఎలా..? జూన్ 1 నుంచే అంటోన్న విజయన్..?
కరోనా వైరస్ వల్ల జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో.. ఇంటి నుంచే క్లాసులు జరుగుతాయని పేర్కొన్నది. కానీ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేవని నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. దీంతో విద్యార్థుల ఆన్ లైన్ తరగతుల నిర్వహణ అంశం ప్రశ్నార్థకమైంది. రాష్ట్రంలో సరైన ఏర్పాట్లు చేయకుండానే... తరగతుల నిర్వహిస్తామని పినరయి విజయన్ ఎలా ప్రకటించారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

43.76 లక్షల స్కూళ్లు
ఆన్ లైన్ తరగతుల నేపథ్యంలో సమగ్ర శిక్ష కేరళ విభాగం 43.76 లక్షల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల నుంచి వివరాలు సేకరించింది. దీనిని ‘హిందూ' పత్రిక రిపోర్ట్ చేసింది. ఇందులో కనీసం 2.6 లక్షల మంది విద్యార్థులకు కనీసం కేబుల్ కనెక్షన్ కూడా లేదు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉన్న మొబైల్ కూడా లేదనే కఠోర నిజం వెలుగుచూసింది. దీంతో పాఠ్యాంశాలు ఆన్లైన్లో ఎలా నిర్వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

వాయనాడులో నో..
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే వాయనాడులో దుర్భరంగా ఉంది. ఇక్కడే 15 శాతం అంటే 21 వేల 653 మంది విద్యార్థులు కంప్యూటర్ లేదు. అలప్పుజ జిల్లాలో తక్కువ సంఖ్యలో అంటే 6,683 మంది విద్యార్థులకు మాత్రమే ఇంటర్నెట్ కలిగిన కంప్యూటర్లు లేవు అని తేలింది. ఆన్లైన్లో పాఠ్యాంశాల కోసం వసతులు లేని వారికి సమకూరుస్తామని సీఎం విజయన్ ప్రకటించారు. కానీ మరో 11 రోజుల్లో పాఠ్యంశాలు బోధించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎలా వసతి కల్పిస్తారని సామాన్యుడి మదిని తొలచివేస్తోంది.

ఫిజికల్ డిస్టన్స్
ఆయా చోట్ల భౌతిక దూరం పాటిస్తూ..లైబ్రరీ లేదంటే పాఠశాలల్లో వసతి కల్పిస్తామని కేరళ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి తప్పకుండా ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తామని తేల్చిచెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల వాయిదాపడ్డ ఎస్ఎస్ఎల్సీ, వొకేషనల్ హైయ్యర్ సెకండరీ పరీక్షలను ఈ నెల 26వ తేదీ నుంచి 30వరకు నిర్వహిస్తామని తెలిపారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications