దారి మళ్లిన ప్రధాని కాన్వాయ్: ఇద్దరు పోలీసులపై వేటు
నోయిడా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్(వాహనశ్రేణి) వెళ్లాల్సిన మార్గం నుంచి దారి మళ్లడానికి కారణమైన ఇద్దరు పోలీసులపై వేటు పడింది. మెట్రో రైలుమార్గాన్ని ప్రారంభించేందుకుగాను మోడీ డిసెంబర్ 25న నోయిడా వెళ్లిన విషయం తెలిసిందే.
ప్రధాని కాన్వాయ్లో ముందుగా వెళ్తున్న ఎస్సై దిలీప్సింగ్, పోలీసువాహన చోదకుడు జైపాల్ తొలుత నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే చోట మలుపు తిరగడంతో.. మహామాయ పైవంతెన వద్ద ప్రధాని రెండు నిమిషాలపాటు ట్రాఫిక్లో చిక్కుకున్నారు.
అనంతరం ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఇతర వాహనాలను దారిమళ్లించి.. ప్రధాని కాన్వాయ్ సులువుగా వేళ్లేందుకు మార్గం సుగమం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యులైన దిలీప్సింగ్, జైపాల్లను ఎస్ఎస్పీ లవ్కుమార్ సస్పెండ్ చేశారు.
మరోవైపు, ప్రధాని భద్రతకు భంగం వాటిల్లేందుకు అవకాశముండేలా కాన్వాయ్ దారిమళ్లిన వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని నోయిడా ఎస్ ఎస్పీ లవ్ కుమార్ తెలిపారు.