పోలీసులపై కత్తులతో దాడి చేసిన నిహంగ్ సిక్కులు: ఇద్దరు నిందితుల కాల్చివేత
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని తర్న్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో పోలీసులకు, నిహంగ్ సిక్కులకు మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో నిహంగ్ సిక్కులు తమ వద్ద ఉన్న కత్తులతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పోలీసుల చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్లో చేసిన అనంతరం ఇద్దరు నిహంగ్ సిక్కులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారనే సమచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో వల్తోహా ఎస్హెచ్ఓ నరేంద్ర సింగ్, ఎస్హెచ్ఓ బల్వీందర్ సింగ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపిన పోలీసులు.. ఇద్దరు నిందితులను కాల్చి చంపేశారు.
కాగా, గత ఏప్రిల్ నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాటియాలలో ఓ మార్కెట్లోకి ప్రవేశించిన ఓ నిహంగ్ సిక్కును అడ్డుకుకోగా.. అతడు ఏఎస్ఐ చేతిని కత్తితో నరికేశాడు. అయితే, వెంటనే చికిత్స అందించిన వైద్యులు చేతిని అంటించారు. ఏడున్నర గంటలపాటు అతనికి చికిత్స చేశారు వైద్యులు.