మహిళపై స్కూల్ మానేసిన టీనేజర్ల గ్యాంగ్రేప్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకొంది. స్కూల్ మానేసిన ఐదుగురు 20 ఏళ్ళ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
'బోయ్ఫ్రెండ్తో అభ్యంతరకంగా చూశాను', ' నాపై అత్యాచారం చేశాడు'
మహిళలపై అత్యాచారాలు , దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లిలో ఈ తరహ ఘటనలు ఎక్కువగా సాగుతున్నాయి. అయితే ఓ మహిళపై స్కూల్ మానేసిన టీనేజీ యువకులు బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు.
టీచర్ గ్యాంగ్రేప్,హత్య: నలుగురు స్టూడెంట్స్కు జీవిత ఖైదు
తమకు తెలిసిన యువకులే నమ్మిన మహిళను తాము పనిచేసే ప్రాంతం నుండి పక్కకు తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై అత్యాచారానికి పాల్పడవద్దని ప్రాధేయపడిన కూడ నిందితులు పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
18 ఏళ్ళ యువకుడితో 42 ఏళ్ళ నర్సు సహజీవనం: షాకిచ్చిన మహిళా కమిషన్
స్కూల్ మానేసిన టీనేజర్ల గ్యాంగ్ రేప్
ఢిల్లీలోని జహంగిపురి ప్రాంతంలో మరో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది.ఐదుగురు జువెనైల్స్ కలిసి ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలికి తెలిసినవారే ఈ దారుణానికి పాల్పడ్డారు.
చంపేస్తామని బెదిరించారు
అత్యాచారం చేసిన నిందితులు బయటకు చెబితే చంపేస్తామని హెచ్చురించారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.జహంగిరి ప్రాంతంలోని మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద భవనం వెనుకకు ఆమెను రాత్రి 10గంటల ప్రాంతంలో బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.
వైద్య పరీక్షలకు పంపిన
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఆమె అరిచే ప్రయత్నం చేస్తే నిందితులు ఆమె గొంతు నొక్కి పట్టి అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలు ఉండే ప్రాంతంలోనే నిందితులు నివాసం ఉంటారని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
స్కూల్ మానేశారు
నిందితులంతా ఇటీవలనే స్కూల్ను మానేశారు.చెత్త డంపింగ్ యార్డ్లో పనులు చేస్తున్నారు.అయితే నిందితులు స్కూల్ మానేసిన తర్వాత మహిళను నమ్మించి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే నిందితులు బాల నేరస్తులు కాకపోతే కోర్టుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు.