పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై రేప్
లక్నో: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది. మోసపోయిన 20ఏళ్ల యువతి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తనపై అత్యాచారం జరిగిందని.. తనను పెళ్లిచేసుకుంటానని ఓ యువకుడు మోసం చేశాడని తెలిపింది. తనను లైంగికంగా వేధించాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్పీ అనిస్ అన్సారీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గంగా నదిలో పడవ బోల్తా: 9మంది గల్లంతు

గంగానదిలో పడవ మునిగి 9మంది గల్లంతైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో చోటుచేసుకుంది. శివకత్ర కాలనీకి చెందిన 12మంది వ్యక్తులు గురువారం సాయంత్రం వినాయకుడి నిమజ్జనం నిమిత్తం విగ్రహంతో సహా పడవపై నదిలోకి వెళ్లారు.
ఆ సమయంలో పడవ అదుపుతప్పి బోల్తాపడింది. గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించగలిగారు. మరో 9మంది గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు కొసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications