దారుణం... లక్నో-ముంబై రైల్లో 20 ఏళ్ల యువతిపై 8 మంది గ్యాంగ్ రేప్...
లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల ఓ యువతిపై 8 మంది గ్యాప్ రేప్కు పాల్పడ్డారు. గత శుక్రవారం(అక్టోబర్ 9) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఇగత్పురి-కసారా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... ఇటీవలే వివాహమైన 20 ఏళ్ల ఓ యువతి గత శుక్రవారం తన భర్తతో కలిసి లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది.పెళ్లి తర్వాత ముంబైలో కాపురం పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఇద్దరు కలిసి రైల్లో ముంబైకి బయలుదేరారు. శుక్రవారం రాత్రి రైలు ఇగత్పురి-కసారా మధ్య ప్రయాణిస్తున్న సమయంలో... 8 మంది గ్యాంగ్ ఆ కొత్తజంట వద్దకు వచ్చి బెదిరించారు. భర్తపై దాడికి పాల్పడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.నిందితుల పేర్లను పాక్య దాము పార్థి(20),అర్షద్ షేక్(19),అర్జున్ అలియాస్ సుభాష్ సింగ్ పర్దేశి(20),కిశోర్ నందు సోనవానే అలియాస్ కలివా(25),కాశీనాథ్ రామ్ చంద్ర కశ్య(23),ఆకాశ్ శెనోర్ అలియాస్ అక్యా(20),ధనంజయ్ భగత్ అలియాస్ గుడ్డు(19),రాహుల్ అదోల్ అలియాస్ రాహుల్యగా గుర్తించారు.వీరిలో నలుగురిపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు.
ఈ ఎనిమిది మంది రైల్లోకి ఎక్కగానే మొదట కొంతమంది ప్రయాణికులను కత్తులతో బెదిరించి డబ్బులు లాక్కున్నారు.నిజానికి రైల్లోకి ఎక్కిన సమయంలో వారికి ఆ ఆలోచన లేదని పోలీసులు తెలిపారు. ఆ గ్యాంగ్లోని ఓ వ్యక్తి మొదట ఓ ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని... దాంతో మిగతావాళ్లు కూడా ఇతర ప్రయాణికులను బెదిరించి డబ్బులు లాక్కున్నారని చెప్పారు. ఇదే క్రమంలో రైల్లో ఉన్న ఓ కొత్తజంటను బెదిరించారన్నారు. ఆమె భర్తపై దాడికి పాల్పడి ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు చెప్పారు.అత్యాచార సమయంలో ఆ ఎనిమిది మంది మరిజునా అనే డ్రగ్ మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
రైల్లో మొత్తం 16 మంది ప్రయాణికులను ఈ గ్యాంగ్ దోపిడీ చేసినట్లు రైల్వే పోలీస్ అధికారి మనోజ్ పాటిల్ తెలిపారు. 9 మంది ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్స్ లాక్కున్నారని చెప్పారు.నిందితులపై ఐపీసీ సెక్షన్లు 395,376డీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.మిగతా నలుగురు నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని... నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications