నగల దుకాణాల్లో చోరీ కేసు: కేంద్రమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో 13 ఏళ్ల క్రితం రెండు నగల దుకాణాల్లో చోరీలకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఈ కేసు విచారణ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు చేపట్టింది.
మంత్రితో పాటు మరో నిందితుడిపై కూడా నవంబర్ 11న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే, నిషిత్ ప్రమాణిక్ న్యాయవాది దులాల్ ఘోష్ వారి తదుపరి చట్టపరమైన చర్యను వెల్లడించలేదు.
2009లో అలీపుర్దూర్ రైల్వే స్టేషన్, బీర్పారా సమీపంలోని నగల దుకాణాల్లో చోరీ ఘటనలు జరిగాయి.

కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి అలీపుర్దూర్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జహర్ మజుందార్ బుధవారం పీటీఐకి తెలిపారు.
కాగా, నిషిత్ ప్రమాణిక్ ఉత్తర బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న దిన్హటా పట్టణంలో నివాసి. 2019లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికైన ఈయన 2019 ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించింది. ఈ కేసులపై సంప్రదించగా.. అలీపుర్దూర్ పోలీసు సూపరింటెండెంట్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications