కారులో తీసుకెళ్లి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో 22 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు తన కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలి నిందితులైన మాణిక్ బగ్గా (18), అతడి స్నేహితుడు బంటీ శర్మ (27) పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఆదివారం సాయంత్రం బంటీతో కలిసి అతడి కారులో బయటకు వెళ్లింది. ఆ తర్వాత అతడికి మాణిక్ నుంచి ఫోను వచ్చిందని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.
అక్కడి నుంచి శ్రీనగర్ ప్రాంతంలోని తమ ఇంటికి తీసుకెళ్లి, అక్కడే తనను బలవంతంగా మరో కారులోకి ఎక్కించారని తెలిపింది. వాళ్లిద్దరూ బాగా తాగారని, తర్వాత మాణిక్ ఆ కారులో తనపై వీఐపీ రోడ్డు సమీపంలో అత్యాచారం చేసి, తన ఇంటి సమీపంలో వదిలేశాడని పేర్కొంది.
విషయం తన తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
బాలికపై గ్యాంగ్రేప్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకనాపూర్ గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆమె పొలానికి వెళుతుండగా ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లా అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను లలిత్ కుమార్, అమిత్లుగా గుర్తించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.