26 మందిపై కేసు.. ఒమర్, ఒవైసీ ఫైర్.. కారణమిదే..?
బహిరంగ ప్రదేశంలో ప్రార్థన నిషిద్దం. అలా చేయాలంటే అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ో 26 మంది ప్రార్థనలు చేశారు. ఇంకేముంది అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదీ ఇరుగు పొరుగు వారికి అభ్యంతరం కలుగుుతందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో గల మొరాదాబాద్ జిల్లా చాజ్లీట్ వద్ద ఘటన జరిగింది. ఇదీ ఐపీసీ 505 (2) ప్రకారం కేసు నమోదు చేశారు. 26 మందిపై కేసు కట్టగా.. 16 మంది పేర్లు తెలుసు.. మరో 10 మంది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఘటన ఈ నెల 24వ తేదీన జరిగిందని స్థానిక పోలీసులు వివరించారు.
ఆ ప్రాంతంలో మసీదుల లేదని ఎస్పీ తెలిపారు. రెండు ఇళ్లు ఉన్నాయని.. అక్కడే ప్రార్థన చేశారని తెలిపారు. ఆ రెండు ఓనర్లకు నోటీసులు జారీచేశామని తెలిపారు. ఆ రెండు ఇళ్ల ఓనర్లు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రార్థన చేసే సమయంలో ఇబ్బంది పడ్డ.. చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేశారు.
ఆ 26 మందిలో ఫిర్యాదు చేసిన వారికి స్నేహితులు లేరా అని ఒమర్ అబ్దుల్లా అడిగారు. అక్కడ జనం గుమిగూడలేదని.. నమాజ్ చేస్తున్నారని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఘటనపై ఒవైసీ కూడా స్పందించారు. ఇదీ తమను అణచివేసే చర్య అని అన్నారు. ఇంట్లో నమాజ్ చేస్తే సమస్య ఏంటీ అని అడిగారు.