వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ధారావిలో 26 పాజిటివ్ కేసులు, మొత్తం 86 కేసులు, ఒకరి మృతి

|
Google Oneindia TeluguNews

ముంబై పారిశ్రామిక వాడ ధారావిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం మరో 26 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ధారావిలో వైరస్ సోకిన వారి సంఖ్య 86కి చేరింది. ఇవాళ ఒకరు చనిపోయారని ముంబై కార్పొరేషన్ అధికారి ఒకరి తెలిపారు. ధారావిలో మృతుల సంఖ్య 9కి చేరింది.

గురువారం ఉదయం 11 మందికి వైరస్ సోకిందిన.. తర్వాత మరో 15 మందిని గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ధారావిలో ఇవాళ ఒక్కరోజే 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ముస్లింనగర్ ప్రాంతంలో అత్యధికంగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముకుంద్ నగర్‌లో 4, సోషల్ నగర్, రాజీవ్ నగర్‌లో రెండు చొప్పున, సాయి రాజ్ నగర్, ట్రాన్సిట్ క్యాంప్, రాంజీ చావ్‌లా, లక్ష్మీ చావ్‌లా, జనతా సొసైటీ, శివశక్తి నగర్, సర్వోదయ్ నగర్‌లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది.

26 new Covid-19 cases in Mumbais Dharavi climbs to 86; 9 deaths

ఆసియాలో ధారావి అతిపెద్ద మురికివాడ. ఇక్కడ 15 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. గురువారం లక్ష్మీ చావ్లాకు చెందిన 58 ఏళ్ల వృద్దుడు వైరస్ సోకి చనిపోయాడు. అతనితో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

English summary
number of coronavirus cases in Dharavi jumped to 86 after as many as 26 people tested positive for the infection on Thursday in the slum area of Mumbai, a civic official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X