మహిళపై గ్యాంగ్రేప్: మరో ఘటనలో విద్యార్థినిపై..
బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులైన సలీమ్, అబిద్, భూరలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలిపై 2014, ఫిబ్రవరిలో ఈ ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ దృశ్యాలను వీడియో తీశారు.
అంతటితో ఆగకుండా ఆ వీడియోలతో బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో వారి వేధింపులు తాళలేక ఆ మహిళ తన భర్తకు విషయాన్ని తెలిపింది. అతడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సలీం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
మరో ఘటనలో బదౌన్లో 16ఏళ్ల దళిత విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ బాధిత యువతి మృతి చెందిందని పోలీసులు చెప్పారు. బాధితురాలి ఇంటిపక్కన ఉండే వ్యక్తి, అతని ఇద్దరు స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సంతోష్ కుమార్ను అరెస్ట్ చేసి, మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.