Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పద్మనాభస్వామి ఆలయంలో 266కిలోల బంగారం మాయం: సుప్రీంకు నివేదిక

తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువనంతపురం శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమైంది. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిటింగ్ నివేదికలో మాజీ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ ఈ విషయం తెలిపారు.

ఆలయంలోని 893 కిలోల బంగారాన్ని వివిధ కార్యక్రమాల నిమిత్తం బయటకు తీసుకెళ్లగా, తిరిగి 627 కిలోల బంగారం మాత్రమే దేవస్థానానికి చేరుకుందని వినోద్‌రాయ్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఆలయంలోని బంగారంపై సంబంధిత రికార్డులను తనిఖీచేసి ఆడిటింగ్ నివేదిక సమర్పించాలని వినోద్‌రాయ్‌ను నిరుడు ఏప్రిల్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

‘266 kg of gold lost from Padmanabhaswamy temple’

వినోద్ రాయ్ నివేదికతో బంగారం మాయం కావడానికి కారణమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని సిపిఎం ఎమ్మెల్యే వి శివకుట్టి వ్యాఖ్యానించారు. కాగా, దేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రావెల్‌కోర్ రాజ కుటుంబం రాయ్ నివేదికపై స్పందించలేదు.

దేవస్థానం పనితీరును పూర్తిగా ప్రక్షాళన చేయాలని న్యాయస్థానానికి సహాయకుడిగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం సిఫార్సుమేరకు జస్టిస్ ఆర్‌ఎం లోధా, జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరుడు ఏప్రిల్‌లో అడిటింగ్ నిర్వహించాలని వినోద్‌రాయ్‌ను ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+