దేశంలో 3.56 కోట్ల నకిలీ ఖాతాలు, రూ.24,495 కోట్ల ఆదా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యక్ష్ హన్స్ తంత్రిలాభ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3.56 కోట్ల నకిలీ బ్యాంకు ఖాతాలను గుర్తించినట్టు కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యక్ష్ హన్స్ తంత్రి లాభ్ పథకం అమలు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా 3.56 కోట్ల నకిలీ బ్యాంకు ఖాతాలను గుర్తించారు.
ఈ మేరకు లోక్ సభలో పెట్రోలియం ,సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.201425, 201516 ఆర్థిక సంవత్సరాలలో మొత్తం 3.56 కోట్ల నకిలీ బ్యాంకు ఖాతాలను గుర్తించినట్టు చెప్పారు.

201415 ఆర్థిక సంవత్సరంలో ఎల్ పి జీ సబ్సిడీ కింద రూ.40,569 కోట్లు, 201516 ఆర్థిక సంవత్సరానికి రై.16,074 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం తదితర కారణాలతో 201516 ఆర్థిక సంవత్సరంలో రూ.24,495 కోట్లు ఆదా అయ్యాయన్నారు.
2017 జనవరి నెల వరకు కోటి ఐదు లక్షల మంది ఎల్ పి జి వినియోగదారులు స్వచ్ఛంధంగా ఎల్ పి జి సబ్సిడిని వదులుకొన్నట్టు మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications