మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
మల్కాన్గిరి: మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు బిఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా జాన్భాయి అటవీప్రాంతంలో చోటుచేసుకుంది.
కూబింగ్ నిర్వహిస్తున్న బిఎస్ఎఫ్ జవాన్లకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. మరో ఆరుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పతికి తరలించారు.
గిరిజనుడిని కాల్చి చంపిన మావోయిస్టులు
ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్లో చోటుచేసుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు కోస్రా అనే గిరిజనుడిని హతమార్చారు.
జైలు వ్యాన్లో ఖైదీల ఘర్షణ: ఇద్దరి మృతి
న్యూఢిల్లీ: తీహార్ జైలుకు చెందిన వ్యాన్లో మంగళవారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఏడుగురు ఖైదీలను తీహార్ జైలు నుంచి రోహిణి కోర్టుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయంత్రం 4.30 గంటలకు వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఐదుగురు, ఇద్దరు చొప్పున ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. ఘర్షణ సమయంలో ఎస్కార్ట్ పోలీసులు వ్యాన్ను ఆపకుండా నేరుగా మంగోల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.