coronavirus:37 మంది పోలీసులకు వైరస్, 8 మంది అధికారులు, 29 మంది సిబ్బంది...
కరోనా వైరస్ మహారాష్ట్రలో ఎక్కువ ప్రభావం చూపుతోంది. దేశంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు ఇక్కడే ఉన్నాయి. అయితే వైరస్ ప్రబలకుండా విధులు నిర్వహిస్తున్న నాలుగో సింహం పోలీసులకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు 37 మంది అధికారులకు వైరస్ వచ్చిందనే విషయం ఆందోళన కలిగిస్తోంది.
37 మందిలో 8 మంది ఆఫీసర్ క్యాడర్ కాగా.. మిగిలిన 29 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా కరోన వైరస్ సోకిన వారిని తాకడంతోనే వైరస్ వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో చాలామంది రోగులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి పాజిటివ్ కేసులు కూడా ఇక్కడే ఎక్కువ నమోదవుతున్నాయి. లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు క్షణం కూడా తీరికలేకుండా విధుల్లో భాగస్వాములవుతున్నారు.
రద్దీ ప్రాంతం, సున్నితమైన ప్రాంతాల్లో కూడా పోలీసులు డ్యూటీ చేశారు. అయితే జనసమ్మర్థం ఉన్న చోట డ్యూటీ చేసే సమయంలో వారికి వైరస్ సోకినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 52 వేల 625 కేసులు పెట్టారు. ఇప్పటికే 10 వేల 729 మందిని అరెస్ట్ కూడా చేశారు. 563 మందిని పోలీసులు హోం క్వారంటైన్కి తరలించారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు 33 వేల 984 వాహనాలను కూడా సీజ్ చేశారు. ఇరుకైన గదుల్లో వాహనాలు తిరగడంతో సీజ్ చేశామని.. ఫైన్ల ద్వారా రూ.కోటి 91లక్షల వసూల్ చేశామని అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించి కనీసం వెయ్యి 47 కేసులు నమోదు చేసినట్టు వివరించారు.