Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఆర్మీ వాహనాలపై దాడి, నలుగురు జవాన్ల వీరమరణం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంఛ్ జిల్లాలో గురువారం రెండు ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజౌరీ-థనామండీ-సురన్​కోటె మార్గంలోని సావ్నీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

బుఫ్లియాజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో జవాన్లను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీ వాహనాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, ముష్కరులకు మధ్య ఎన్‌​కౌంటర్ కొనసాగుతోందని రక్షణ శాఖ పీఆర్ఓ కార్యాలయం తెలిపింది.

4 Army Men Martyred As Terrorists Attack Army Vehicles In Jammu & Kashmirs Poonch

ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రీయ రైఫిల్స్-48 పరిధిలో ఈ ఆపరేషన్ జరుగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రదాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అప్పుడు ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.


కాగా, తాజాగా, 'ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల కచ్చితమైన సమాచారంతో బుధవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నాం. ఆ సమయంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. బలగాలు దీటుగా స్పందించాయి' అని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్​వాల్ వెల్లడించారు. ఉగ్రవాదులతో సైనికులు ముష్టి యుద్ధం కూడా చేశారని అధికార వర్గాల సమాచారం. దాడి తర్వాత ఉగ్రవాదులు సైనికుల ఆయుధాలతో పారిపోయారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+