భర్త, కొడుకును కట్టేసి మహిళపై 10మంది గ్యాంగ్రేప్

పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి దళిత వర్గానికి చెందిన కుటుంబం పొలం పనులు ముగించుకుని వస్తుండగా పొదల్లో దాక్కొని ఉన్న పది మంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు.
ప్రతిఘటించిన బాధితురాలి భర్త, కుమారుడిని కట్టి పడేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పి రవీంద్ర గౌడ్ తెలిపారు.
వైద్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్య నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఘటనపై సమాచారం అందినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని కంటోన్మెంట్ పోలీసులపై చర్య తీసుకుంటామని ఎస్పి వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications