ప్రభుత్వ రహస్య పత్రాల లీకు: ఇద్దరు అధికారులు సహా 5గురి అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య పత్రాలను లీక్ చేసిన కేసులో అయిదుగురు అరెస్టయ్యారు. వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రహస్య పత్రాలను లీక్ చేసిన కేసులో.. అరెస్టైన వారిలో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు.
పోలీసులు మరో జర్నలిస్ట్ను ఇందుకు సంబంధించిన కేసులో విచారిస్తున్నారని తెలుస్తోంది. కార్పోరేట్ పెద్దలకు ఈ రహస్య పత్రాలను అందచేయాలన్నది వారి పథకంగా ఉందని సమాచారం.

నిందితులు అయిదుగురు కూడా ఆ డాక్యుమెంట్లను బిజినెస్మెన్లకు ఇవ్వాలని చూశారు. ఈ పత్రాల ద్వారా ప్రభుత్వ విధాన నిర్ణయాలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు.
అరెస్టైన వారిలో ఇద్దరు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియంకు చెందిన అధికారులు, మరో ఇద్దరు మీడియేటర్లు ఉన్నారు. కాగా, దిగుమతులతో పాటు ధరల నిర్ణయానికి సంబంధించిన విధాన నిర్ణయాలు ఈ పత్రాల్లో ఉన్నాయని సమాచారం. పోలీసులు వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పత్రాల లీక్ పైన కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications