5రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. పశ్చిమ్బంగా, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి కూడా ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ శుక్రవారం వెల్లడించారు.
ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 1,070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అస్సాంలో 126, తమిళనాడులో 234, బంగాల్లో 294, కేరళలో 140, పుదుచ్చేరిలో 30శాసనసభా స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
కేరళలో 21వేలు, తమిళనాడులో 65వేలు, పశ్చిమ బెంగాల్లో 77వేలు, పుదుచ్చేరిలో 913 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉంటాయని జైదీ తెలిపారు. అన్నిచోట్లా ఈవీఎంలనే ఉపయోగిస్తామని అన్నారు. నోటాకు కూడా ప్రత్యేక గుర్తును ఈ ఎన్నికల నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు.
64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఈవీఎంలకు ప్రింటర్లు జతచేస్తున్నామని అన్నారు. అభ్యర్థులందరి ఫొటోలను కూడా ఈవీఎంలలో ఉంచుతామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అస్సాంలో 2 దశలలోనూ, పశ్చిమబెంగాల్లో 6 దశలలోను, మిగిలిన మూడు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలోను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 19వ తేదీన ఉంటాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ మే 21 నాటికి ముగుస్తుందని నసీం జైదీ ప్రకటించారు.

షెడ్యూల్ వివరాలు:
అసోం తొలి దశ 65 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: మార్చి 11
నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి
నామినేషన్ల పరిశీలన: 19 మార్చి
ఉపసంహరణ గడువు: 21 మార్చి
పోలింగ్ తేదీ: 4 ఏప్రిల్ (సోమవారం)
రెండోదశ 61 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: మార్చి 14
నామినేషన్ల ముగింపు తేదీ: 21 మార్చి
నామినేషన్ల పరిశీలన: 22 మార్చి
ఉపసంహరణ గడువు: 26 మార్చి
పోలింగ్ తేదీ: 11 ఏప్రిల్ (సోమవారం)
పశ్చిమబెంగాల్ తొలి దశ 18 నియోజకవర్గాలు(రెండుసార్లుగా జరుగుతుంది)
నోటిఫికేషన్ జారీ: 11 మార్చి, 21 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి, 22 మార్చి
నామినేషన్ల పరిశీలన: 19 మార్చి, 26 మార్చి
పోలింగ్ తేదీలు: 4 ఏప్రిల్, 11 ఏప్రిల్
రెండోదశ 56 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: 22 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 29 మార్చి
నామినేషన్ల పరిశీలన: 30 మార్చి
ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 1
పోలింగ్ తేదీ: 17 ఏప్రిల్
మూడోదశ 62 నియోకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: 28 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 4 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 7 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 21 ఏప్రిల్
నాలుగోదశ 49 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 1
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 4
నామినేషన్ల పరిశీలన: 9 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 11 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 25 ఏప్రిల్
ఐదోదశ 53 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 4
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 11
నామినేషన్ల పరిశీలన: 12 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 16 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 30 ఏప్రిల్
ఆరోదశ 25 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 11
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 18
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19
ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 21
పోలింగ్ తేదీ: మే 5
కేరళ 140 నియోజకవర్గాలు
ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 2 మే
పోలింగ్ తేదీ: 16 మే
తమిళనాడు 234 నియోజకవర్గాలు
ఒకే దశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 2 మే
పోలింగ్ తేదీ: 16 మే
పుదుచ్చేరి 30 నియోజకవర్గాలు
ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 2 మే
పోలింగ్ తేదీ: 16 మే
ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ: మే 19.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications