ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి, ఆరుగురు ఒకే కుటుంబం వారే
మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు.
జల్గావ్ జిల్లా చాలీస్గావ్- ఔరంగాబాద్ రహదారిపై రెండు కార్లు ఎదురెదుగా ఢీకొనటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారును ద్విచక్ర వాహనదారుడు ఢీకొనటంతో అతను కూడా చనిపోయాడు. మృతులను చాలీస్గావ్ సమీపంలోని బోదారే గ్రామానికి చెందిన రాజేంద్ర చవాన్(40), నాందేవ్ చవాన్ (42), షిలాబాయి చవాన్(35), మితేష్ చవాన్(18), మిథున్ చవాన్(23), శుభం చవాన్(18)గా గుర్తించారు.
ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చాలీస్గావ్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.