దారుణం: పేరెంట్స్పై కక్ష, బాలిక రహస్య భాగాల్లోకి కడ్డీలు చొప్పించి..
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులోని సోలా ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక పైన ఒక సెక్యూరిటీ గార్డు దారుణానికి పాల్పడ్డాడు. రహస్య భాగాలలోకి ఇనుప కడ్డీని చొప్పించడంతో ఆ బాలికకు అంతర్గతంగా తీవ్ర గాయాలు అయ్యాయి.
ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చిన కౌశల్ అనిల్ సింగ్ చౌహాన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. బాలిక పైన అత్యాచారం జరగకపోయినా కొత్త చట్టం ప్రకారం ఈ ఘటనను అత్యాచారం కింద పరిగణించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
నిర్మాణంలో ఉన్న ఒక భవంతి వద్ద బాలిక ఆడుకుంటుండగా చౌహాన్ ఆమెను తీసుకుపోయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు కూలీలుగా పని చేస్తున్నారు. వారికి సెక్యూరిటీ గార్డుగా ఉన్న చౌహాన్తో గతంలో గొడవలు అయ్యాయి. ఈ కక్షతోనే వారి కుమార్తె పైన ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించారు.