ప్రాణం తీసిన గుర్రపు స్వారీ: చిన్నారిని 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది
అలీబాగ్: సరదా కోసం చేసిన గుర్రపు స్వారీ యూకేకి చెందిన ఏడేళ్ల బాలిక ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా మారథాన్ హిల్స్ స్టేషన్లో చోటు చేసుకుంది.
వపోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
యూకేకి చెందిన ఇండియా మెవ్యూతన కుటుంబ సభ్యులతో కలిసి అలీబాగ్లోని మాథరాన్ హిల్స్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం గుర్రంపై ఎంజాయ్ చేస్తుంది. అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో గుర్రం ఒక్కసారిగా పిచ్చిపట్టినదానిలా బాలికతో సహా అడవిలోకి పరుగు తీసింది.
దీంతో ఆ చిన్నారి గుర్రంపై నుంచి కిందపడింది. ఆ సమయంలో చిన్నారి కాలు గుర్రానికి ఉన్న కల్లెంలో ఇరుక్కుపోవడంతో చిన్నారిని సుమారు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. చిన్నారికి తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గం మధ్యలోనే తన ప్రాణాలను కోల్పోయింది.

చిన్నారి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తండ్రి గోవిన్ మెవ్యూ దుబాయ్లోని ఒ చిన్న కంపెనీలో పనిచేస్తున్నాడు. ముంబైకి వచ్చిన అతడు తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు మాథరాన్ హిల్స్ స్టేషన్కు రాగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
చిన్నారి తల్లిదండ్రులు గుర్రుపు ఆపరేటర్పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ప్రమాదశాత్తూ చిన్నారి మరణించినట్లుగా కేసు నమోదు చేసుకున్నట్లు మాథరాన్ హిల్స్ పోలీసు స్టేషన్ ఎస్ఐ రాజ్ వర్దన్ తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications