7.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, విదేశీ మహిళ అరెస్ట్
ముంబై: గుట్టుచప్పుడు కాకుండా మత్తు మందులు తరలిస్తున్న మహిళను ముంబై కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మహిళ నుండి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
టాంజానియాకు చెందిన చాంబో పాత్మ బాసిల్ అనే మహిళను అరెస్టు చేసి రూ. 7.4 కోట్ల విలువైన 74 కేజీల మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. బుధవారం విమానంలో దోహా మీదుగా దార్-ఇ-సలామ్ కు మత్తు పదార్థాలు తరలించడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన అధికారుల దగ్గర ఉన్న స్నీపర్ డాగ్స్ డ్రగ్స్నుపసిగట్టాయి. వెంటనే మత్తు పదార్థాలు తరలించడానికి ప్రయత్నించిన బాసిల్ ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసున్నారు. సాధారణ సోదాలలో భాగంగానే స్నీపర్ డాగ్స్ డ్రగ్స్ ను పసిగట్టాయి.
ముంబై ఎయిర్ పోర్టులో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటి సారి అని కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ మిలింద్ లాంజేవార్ అంటున్నారు. బాసిల్ ఎక్కడి నుండి ఈ మెథాక్విలోన్ (డ్రగ్స్) తీసుకు వచ్చింది, ఈ దందాలో ఇంకా ఎంత మంది ఉన్నారు అని విచారణ చేస్తున్నారు.