వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బచ్చా గ్యాంగ్: పోలీసునే దోచుకున్న 9ఏళ్ల బాలిక, రూ.4 లక్షలతో పరారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

మధుర: తొమ్మిదేళ్ల బాలిక ఓ పోలీసుకే టోకరా వేసి, నాలుగు లక్షల రూపాయలతో ఉడాయించిన సంఘటన బుధవారం మథురలోని కోటావ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసు కానిస్టేబుల్ దగ్గర్నుంచి దర్జాగా రూ 4 లక్షలు దోచుకు వెళ్లింది. కానిస్టేబుల్‌ విజయ్‌ పాల్‌ సింగ్‌, తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం, బుధవారం చౌకీ బాగ్‌ వద్దనున్న బ్యాంకులో రూ 4.02 లక్షలు డ్రా చేసుకున్నాడు.

అతడు బయటికి రాగానే, ఓ బాలిక అతడి ప్యాంట్‌పై మురికి ఉందని, శుభ్రం చేసుకోవాలని చెప్పింది. దాంతో విజయ్‌పాల్‌ డబ్బుల సంచీని కింద పెట్టి ప్యాంట్‌ను చూసుకోసాగాడు. అంతే కేవలం లిప్త కాలంలో ఆ బాలిక డబ్బుల బ్యాగ్‌తో మాయమైపోయింది. దీంతో ఆ కానిస్టేబుల్‌ లబోదిబోమంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

9-Year-Old Robs Rs. 4 Lakh Off Constable in Mathura

మధురలో ఇటీవలి కాలంలో బచ్చా గ్యాంగ్‌ (పిల్లల ముఠా)లు పెచ్చుమీరిపోయాయని, పిల్లలు విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారి ఆట కట్టిస్తామని పోలీసులు చెబుతున్నారు. తొమ్మిదేళ్ల బాలికను ఆ బచ్చా గ్యాంగ్ సభ్యురాలిగా అనుమానిస్తున్నారు.

విజయపాల్ సింగ్ ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబం మాత్రం ఔరంగాబాదులో ఉంటోంది. పక్షం రోజుల్లో కూతురి పెళ్లి జరగాల్సిన స్థితిలో డబ్బు దోపిడీకి గురికావడంతో విజయ్ పాల్ సింగ్ దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు.

English summary
A nine-year-old girl, suspected to be a member of so-called 'Baccha Gang' (gang of children), on Wednesday allegedly deceived a constable off Rs. 4 lakh in Mathura's Kotwali area, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X