తబ్లిఘికి వచ్చిన 960 మంది విదేశీయుల వీసాలు రద్దు, బ్లాక్ లిస్టులోకి..: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీ తబ్లిఘి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. అంతేగాక, వారి పాస్ పోర్టులను బ్లాక్ లిస్టులో పెడుతూ కేంద్రం హోంశాఖ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీయులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పర్యాటక వీసాలపై వచ్చిన ఈ విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

విదేశీయుల చట్టం-1946, విపత్తు నిర్వహణ చట్టం-2005ను వారు ఉల్లంఘించి ఢిల్లీ నిజాముద్దీన్లోని తబ్లీఘీ జమాత్ మత కార్యక్రమంలో పాల్గొనడంతో వీరిపై చర్యలు తీసుకోవాలని వివిధ రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
కాగా, ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ మర్కజ్ దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్గా మారిన విషయం తెలిసిందే. మర్కత్కు వెళ్లివచ్చిన వారి కారణంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 400 కేసులకుపైగా తబ్లిఘీ జమాత్ తో సంబంధం ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనావైరస్ సోకిన విదేశీయులు మర్కత్ జమాత్ కు హాజరవడంతోనే మనదేశ ముస్లింలకు వైరస్ సోకడం గమనార్హం. ప్రస్తుం భారతదేశంలో 2వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకడంతో 50కిపైగా మరణాలు సంభవించాయి.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications