జాగ్రత్త: 15 నిమిషాలకో కారు చోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కార్ల దొంగతనాలు ప్రతి 15 నిమిషాలకు ఓ చోట జరుగుతున్నాయని పోలీసు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువగా కార్లు చోరీ అవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
జూలై నెలలో ఢిల్లీ నగరలో ప్రతి రోజు సరాసరి 100 కార్లు చోరీ అయ్యాయని పోలీసులు కేసులు నమోదు చేశారు. 2011లో నమోదు అయిన కార్ల చోరీ కేసుల కంటే రెండింతలు ఎక్కువగా ఈ సంవత్సరం ఇప్పటికే చోరీ కేసులు నమోదు అయ్యాయి.

చోరీకి గురైన కార్లు కేవలం 13 శాతం మాత్రమే రికవరీ అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. వాహనాల సంఖ్య పెరిగిపోవడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడం తదితర కారణాలతో కార్లు ఎక్కువ చోరీ అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఎస్ యూవీలతో పోల్చుకుంటే చిన్న కార్లు ఎక్కువగా చోరీ అవుతున్నాయి. కేవలం గత జూలై నెలలో పశ్చిమ ఢిల్లీలో 478, అవుటర్ డిస్ట్రిక్ట్ లో 492, తూర్పు ఢిల్లీలో 517 కార్లు చోరీ అయ్యాయని పోలీసులు తెలిపారు.
రాత్రి పూట గస్తి ఎక్కువగా ఉన్నా ఎక్కడో ఓ చోట వాహనాలు చోరీ అవుతున్నాయని పోలీసులు అన్నారు. మాస్టర్ కీస్, బ్రేక్ లాక్ లతో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications