Wife: రాత్రి ఇంట్లో భార్య, భర్త లిక్కర్ పార్టీ, మ్యాటర్ బయటకు వచ్చింది. ప్రైవేట్ పార్ట్స్ తో ? చంపేశాడు !
రాత్రి భర్త మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో భార్య కూడా ఇంట్లో మద్యం సేవించింది. తరువాత ఆదర్శ దంపతుల మధ్య గొడవ జరిగింది. దెబ్బకు భార్యను చంపేసిన భర్త ఓపని అయిపోయిందని అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.
పూణే/ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. భార్య వైపు, భర్త వైపు కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇంట్లో లేకపోవడంతో దంపతులు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. భర్త ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి రాత్రి మాత్రమే ఇంటికి వస్తున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య బయట తిరగడం మొదలుపెట్టింది. రాత్రి భర్త మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో భార్య కూడా ఇంట్లో మద్యం సేవించింది. తరువాత దంపతుల మధ్య గొడవ జరిగింది. దెబ్బకు భార్యను చంపేసిన భర్త ఓపని అయిపోయిందని అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.
Bengaluru: పార్క్ లో లవర్స్, ఏందిరా ఇలా చేస్తున్నారు లఫూట్, పేటీఎంలో లంచం తీసుకున్న పోలీస్ !
ముంబాయిలో ఫ్యామిలీ
మహారాష్ట్రలోని పూణేలో బిబ్వేడి ప్రాంతంలోని ఇందిరా నగర్ లో పరుశురామ్ అలియాస్ పరుశురామ్ జోగన్ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పరుశురామ్ పూణేలో ఆటో డ్రైవర్. కొన్ని సంవత్సరాల క్రితం పరుశురామ్ స్వప్నా అలియాస్ స్వప్నా రాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత పరుశురామ్, స్వప్నా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.
బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న భార్య
పరుశురామ్, స్వప్నా కుటుంబ సభ్యులు వేరే ఊరిలో నివాసం ఉంటున్నారు. భార్య స్వప్నాతో కలిసి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న పరుశురామ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. పరుశురామ్ ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి ఆటో తీసుకుని బయటకు వెళితే పూణే సిటీలో బాడుగుతకు తిప్పుతూ తిరిగి రాత్రి మాత్రమే ఇంటికి వస్తున్నాడు. పరుశురామ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత అతని భార్య స్వప్నా పగలు బయట తిరగడం మొదలుపెట్టింది.
ఆదర్శ దంపతులు
పరుశురామ్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. బయట మద్యం సేవించి క్వాటర్ ఇంటికి తీసుకు వెలుతున్న భర్త అక్కడ కూడా మద్యం సేవించేవాడు. మద్యం మత్తులో పరుశురామ్ ఉంటే అతను మిగిలించిన మద్యం స్వప్నా తాగడం మొదలుపెట్టింది. స్వప్నా కూడా లిక్కర్ తాగడం అలవాటు చేసుకుంది, తనకు తెలీకుండా తన భార్య స్వప్నా మద్యం సేవిస్తుందని తెలుసుకున్న పరుశురామ్ రానురాను ఆమెకు కూడా మద్యం తీసుకుని ఇంటికి వెళ్లడం మొదలుపెట్టారు.
రాత్రి ఇంట్లో దంపతుల లిక్కర్ పార్టీ
రాత్రిపూట ఇంట్లో పరుశురామ్, స్వప్నా దంపతులు కలిసి మద్యం తాగుతూ ఆదర్శ దంపతులుగా ఫీలైపోయి జీవించడం మొదలుపెట్టారు. ఎప్పటిలాగే రాత్రి కూడా పరుశురామ్ అతని భార్య స్వప్నాతో కలిసి మద్యం సేవించాడు. పరుశురామ్, స్వప్నా ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ఆ సందర్బంలో ఇద్దరి మధ్య ఓ విషయంలో మాటామాటా పెరిగింది. మద్యం మత్తులో ఉన్న పరుశురామ్ పదునైన ఆయుధంతో అతని భార్య స్వప్నా మీద దాడి చేశాడు. స్వప్నా ప్రైవేట్ భాగాలతో పాటు ఛాతీ మీద బలమైన గాయాలు కావడం, అప్పటికే ఆమె మద్యం మత్తులో ఉండటంతో అక్కడిక్కడే చనిపోయింది.
రాత్రి భార్య విషయంలో అదే జరిగింది
భార్య స్వప్నాను చంపేసిన పరుశురామ్ అక్కడే ఉండిపోయాడు. సమాచారం తెలుసుకున్న పూణే పోలీసులు ఆటో డ్రైవర్ పరుశురామ్ ను అరెస్టు చేశారు. రాత్రి పరుశురామ్ దంపతులు మద్యం సేవించారని, ఆ సందర్బంలో గొడవ జరగడంతొ పరుశురామ్ అతని భార్యను చంపేశాడని, కేసు విచారణలో ఉందని పూణే సిటీ పోలీసు అధికారులు తెలిపారు.