బెలూన్ల నిండా వీర్యమా? సాధ్యమయ్యే పనేనా?: చర్చనీయాంశమైన వైద్యుడి ట్వీట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హోళీ వేడుకల్లో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే నిరసనలు చేపట్టారు.
ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు వివిధ కళాశాలల విద్యార్థినులు ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమీషన్ సైతం ఈ వ్యవహారంపై మండిపడటంతో పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేపట్టారు.

బెలూన్లలో వీర్యం సాధ్యం కాదంటూ..
కాగా, ఈ దాడిని నిరసిస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ క్రమంలో వీర్యాన్ని బెలూన్లలో నింపి దాడులు చేయడం సాధ్యమయ్యే పనే కాదంటూ ఓ వైద్యుడు చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ప్రత్యేక పరికరాలు అవసరం
అంతేగాక, ఆమె తీరును ఖండిస్తూ సదరు వ్యక్తి ట్వీట్లు చేశారు. ‘అసలు అంత స్థాయిలో వీర్యాన్ని సేకరించటం సాధ్యమయ్యే పని కాదు. ఆరోగ్యవంతమైన మానవుడు 5 మిల్లిలీటర్ల కన్నా ఎక్కువ వీర్యాన్ని స్కలించలేడు. ఒకవేళ అంతస్థాయిలో సేకరించినా అది ఎంతో సేపు లిక్విడ్ స్టేజీలో ఉండలేదు. వాటిని నిల్వ చేయాలంటే ప్రత్యేక పరికరాల్లో నింపాల్సి ఉంటుంది' అని ఆ వైద్యుడు పేర్కొన్నాడు.

కారణాలతో వివరణ
‘ఆ బెలూన్లలో నీటిని కలిపి నింపారనుకున్నా.. దాని తత్వాన్ని అది కోల్పోతుంది. పైగా అసలు దానిని బెలూన్లలో నింపటం కుదిరే పని కాదు. పోనీ.. ద్రవరూప నైట్రస్ ఆక్సైడ్తో దానిని నింపారనుకున్న అందుకు ఆస్కారమే లేదు' అంటూ పలు కారణాలను వివరిస్తూ ఆ వాదనను ఖండించారు.

ది గుడ్ డాక్టర్ పేరుతో..
కాలాతీథమ పేరుతో ‘ది గుడ్ డాక్టర్' పేరిట ఆ ట్విట్టర్ ఖాతా ఉంది. పైగా అందులోని వ్యక్తి వైద్యుల మాస్కులు ధరించి ఉండటంతో బహుశా ఆతనో వైద్యుడయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ట్వీట్లకు పలువురు మద్దతు పలుకుతుండగా, మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications