ట్రాన్స్ జెండర్స్: అర్ధనారీశ్వరుడితో దసరా వేడుక
కోల్కతా: దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వలింగ సంపర్కులు దసరా వేడుకలలో భాగమయ్యారు. ప్రత్యేకంగా స్వలింగ సంపర్కులు కలిసి దసరావేడుకలను నిర్వహిస్తున్నారు.
కోల్ కతా నగరంలో ట్రాన్స్ జెండర్స్ అంతా ఏకమైనారు. తమపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ప్రత్యేక దసరా వేడుకలు నిర్వహించుకుంటున్నామని స్వలింగ సంపర్కుల ఉద్యమకారుడు అనింద్య హజ్రా అన్నారు.

ట్రాన్స్ జెండర్స్ అందరూ కలిసి దుర్గా మాత విగ్రహాన్ని కాకుండా అర్ధనారీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా నవరాత్రి ఉత్సవాలను ట్రాన్స్ జెండర్స్ మాత్రమే ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు.
తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని, తమ హక్కులు తమకు కావాలనే ఉద్దేశంతోనే ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ట్రాన్స్ జెండర్స్ ఉద్యమకారుడు అనింద్య హజ్రా అంటున్నారు. ఈ వేడుకలలో కోల్ కత్తా నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న స్వలింగ సంపర్కులు పెద్ద సంఖ్యలో పాల్గోంటున్నారు.












Click it and Unblock the Notifications