Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుమార్తె బీఎస్సీ చివరి సంవత్సరం: ఫీజు కట్టలేని తండ్రి ఏం చేశాడంటే, దేవాలయంలో !

కాలేజ్ లో బీఎస్సీ చదువుతున్న కుమార్తె ఫీజు కట్టడానికి ఆర్థికస్థోమత లేని ఓ తండ్రి చివరికి అవమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది.

మైసూరు: కాలేజ్ లో బీఎస్సీ చదువుతున్న కుమార్తె ఫీజు కట్టడానికి ఆర్థికస్థోమత లేని ఓ తండ్రి చివరికి అవమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది. మెట్టగేహళ్ళిలో నివాసం ఉంటున్న గంగాధర్ (51) అనే ఆయన గురువారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గంగాధర్ కుమార్తె బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. మైసూరు నగరంలోని బృందావన్ లేఔట్ లోని శ్రీ గణపతి దేవాలయంలో గంగాధర్ ప్రసాదం తయారు చేసే చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కాలేజ్ ప్రారంభం కావడంతో రూ.12,500 ఫీజు కట్టాలని కుమార్తె గంగాధర్ కు చెప్పింది. జూన్ 22వ తేది (గురువారం) చివరి రోజు అని గుర్తు చేసింది.

A man who was unable pay his daughters fees commits suicide in Mysuru

దేవాలయం ఆవరణంలోని ఓ చిన్న ఇంటిలోనే గంగాధర్ నివాసం ఉంటున్నాడు అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం గంగాధర్ భార్య చనిపోయింది. కుమార్తె ఫీజు చెల్లించలేని తాను ఉన్నా ఒక్కటే, చనిపోయినా ఒక్కటే అనుకున్నాడు.

గురువారం ఉదయం కుమార్తె కాలేజ్ కు వెళ్లిన వెంటనే దేవాలయం ఆవరణంలోని ఇంటిలోనే గంగాధర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు చలించిపోయారు. తల్లి అనారోగ్యంతో చనిపోవడం, తోడుగా ఉన్న తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థిని ఆర్తనాదాలు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+