Crime News: భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన మహిళ.. డబ్బు కోసమేనా..!
జైపూర్లో యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. యువకుడిని ప్రియురాలు, భర్త, భర్త సోదరుడితో కలిసి హత్య చేసింది. వివాహిత ప్రేమికుడిని మొదట జైపూర్కు పిలిచారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి యువకుడిని కిడ్నాప్ చేశారు. తీవ్రంగా కొట్టి కరౌలిలో రోడ్డుపై పడేసి పారిపోయారు. హత్య కేసులో మహిళతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త సోదరుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రియురాలు ఛోటీదేవి (30), ఆమె భర్త భీమ్సింగ్ మీనా (32)లను అరెస్టు చేసినట్లు డీసీపీ (ఈస్ట్) కరణ్ శర్మ తెలిపారు. సవాయ్ మాధోపూర్లోని బజీర్పూర్లో నివాసం ఉంటున్న దీపాం మీనా (30) తన సోదరుడు రాంప్రతాప్ (19)ని ఆగస్టు 28న హత్య చేసినట్లు ఫిర్యాదు చేసింది. రాంప్రతాప్ సవాయ్ మాధోపూర్లోని బజీర్పూర్లో ఉంటూ ట్రాక్టర్ నడుపుతూ ఉండేవాడు. అతను ధానిలో నివసించే భీమ్ సింగ్ భార్య ఛోటీ దేవితో ప్రేమలో పడ్డాడు. జూలై 6న రాంప్రతాప్ ఇంట్లో నగలు, నగదు అపహరించాడు. రాంప్రతాప్ నగలు అమ్మిన తర్వాత ఛోటీదేవితో జైపూర్కు పారిపోయారు. జైపూర్లోని జగత్పురాలో అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరూ హోటల్లో పని చేయడం ప్రారంభించారు.

ఈ క్రమంలో ఛోటీదేవి రాంప్రతాప్ను హత్య చేయాలని ప్లాన్ చేసింది. పథకం ప్రకారం, ఆమె తన భర్త భీమ్, భర్త సోదరుడు పుఖ్రాజ్కు జైపూర్కు రప్పించింది. ఛోటీ దేవితో పాటు ప్రేమికుడు రాంప్రతాప్ను వారు కారులో కూర్చోబెట్టారు. చుట్టుపక్కల వారు అడగ్గా.. ఇద్దరూ పారిపోయారని, ఇప్పుడు తమతో పాటు ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత రాంప్రతాప్ ను కొట్టి చంపారు. ఆ తర్వాత రోడ్డుపై మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేందించారు.












Click it and Unblock the Notifications