ఈసారి ఎన్నికల్లో మరో విచిత్రం-115 సీట్లలో తగ్గిపోయిన ఓటర్లు-టాప్ లో 6 రాష్ట్రాలు..!
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఈసారి చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ శాతాలు బయటపెట్టేందుకు ఈసీ నిరాకరిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అదే సమయంలో మరో అనుమానాస్పద వ్యవహారం బయటికి వచ్చింది. గతంతో పోలిస్తే ఈసారి చాలా సీట్లలో ఓటర్లు తగ్గిపోయారట. ఇప్పటివరకూ జరిగిన ఐదు దశల పోలింగ్ లో 27 శాతం సీట్లలో అంటే ఏకంగా 115 స్ధానాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు తగ్గిపోయారు.
దేశంలో ఈసారి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ ముగిసేసరికి మొత్తం 427 సీట్లలో ఓటింగ్ ముగిసింది. వీటిలో 27 శాతం సీట్లలో అంటే 115 లోక్ సభ నియోజకవర్గాల్లో 2019 కంటే తక్కువగా ఓటింగ్ నమోదైంది. ఇది దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ జరగని విచిత్రం. ఆయా సీట్లలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ప్రతీ చోటా భారీగా ఓటర్లు తగ్గిపోయారు. ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈసీ సమగ్రంగా పోలింగ్ శాతం బయటపెట్టకపోవడంపై సుప్రీంలో దాఖలైన కేసుపై విచారణ జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికల్లో ఐదో దశ వరకూ ఈసారి 505 మిలియన్లకు పైగా ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. 2019లో ఈ సంఖ్య 485 మిలియన్ ఓటర్లు. అంటే కేవలం 4 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే 2019లో ఇదే నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 2014 కంటే 12 శాతం పెరిగారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికలలో మొత్తం ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 115 నియోజకవర్గాలలో మొత్తం ఓటర్ల సంఖ్య 2019 నుంచి తగ్గింది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా అరుదుగా భావిస్తున్నారు.
చాలా నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లలో ఇంత భారీ తగ్గుదల ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్న రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీగా ఓట్లు తొలగించారని అనుకున్నా స్ధూలంగా చూస్తే ఈ లెక్క కూడా తప్పేనని తేలుతోంది. అన్ని నియోజకవర్గాలలో మొత్తం ఓటర్లలో మూడింట ఒక వంతు ఓటర్లను 2019 నాటికే తిరస్కరించారు.ఇంకా చెప్పాలంటే మొత్తం ఓటర్లు తగ్గుముఖం పట్టిన నియోజకవర్గాల్లో చాలా వరకు ఆరు రాష్ట్రాలు కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నారు.
దీని వెనుక మూడు కారణాలు కనిపిస్తున్నాయి. కొత్త అర్హత కలిగిన ఓటర్ల సంఖ్య, వలస వెళ్లిన ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల శాతం. ఆర్థిక లేదా ఇతర బలవంతపు కారణంగా ఈ 115 నియోజకవర్గాల నుండి ప్రజల వలసలు అకస్మాత్తుగా పెరిగాయి. 2014 లేదా 2019 ఎన్నికలలో గత ఎన్నికల కంటే ఈ నియోజకవర్గాలలో ఏ ఒక్కటీ మొత్తం ఓటర్లలో తగ్గుదలని నమోదు చేయలేదు. ఆయా సీట్లలో ప్రతిపక్షాలు 2019లో గెలిచాయా లేక 2024లో బలపడ్డాయా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. తగ్గిన ఓటింగ్ శాతం స్వచ్ఛందంగా జరిగిందా లేదా పరోక్షంగా బలవంతంగా జరిగిందా అనే చర్చ జరుగుతోంది.
ఇది స్వచ్ఛందంగా జరిగి ఉందని భావిస్తే 2024లో కీలకంగా మారిన రాష్ట్రాల్లో ఇలా ఓటర్లు తగ్గడం ఏ లాజిక్ కూ అందడం లేదు. ఐదేళ్లకోసారి జరిగే రెండు సార్వత్రిక ఎన్నికల మధ్య సంపూర్ణ ఓటర్ల సంఖ్య క్షీణించడం మన దేశంలో చాలా అరుదు. అయితే 2019తో పోలిస్తే 2024లో దాదాపు మూడింట ఒక వంతు నియోజకవర్గాల్లో అలాంటి క్షీణత నమోదైంది. దీనిపై ఈసీ ఏం చెప్తుందో చూడాలి.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications