Russian: ఒడిశాలో మరో రష్యన్ మృతి.. అస్సలక్కడ ఏం జరుగుతంది..!
ఇటీవల రాయగడలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్ల మరణాల మిస్టరీ తర్వాత, మంగళవారం ఒడిశాలో మరో రష్యన్ జాతీయుడు శవమై కనిపించాడు. జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో ఉన్న ఓడలో రష్యా జాతీయుడు శవమై కనిపించాడు. అతన్ని చీఫ్ ఇంజనీర్ మిల్యకోవ్ సెర్గీగా గుర్తించారు. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ముంబయి వెళ్తోన్న నౌకలో అతడు చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు.

23 మంది
నౌకలో భారతీయ, రష్యన్ జాతీయులతో సహా 23 మంది సిబ్బంది ఉన్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పారాదీప్ పోర్ట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.అంతకుముందు, రష్యా శాసనసభ్యుడు, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్ డిసెంబర్ 24 న ఒడిశాలోని రాయగడలోని ఒక హోటల్లో శవమై కనిపించారు. అతని మృతదేహం నిర్మాణం జరుగుతున్న మొదటి అంతస్తు పైకప్పుపై పడి ఉంది.

అపస్మారక స్థితి
అతను తన స్నేహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్, మరో ఇద్దరు రష్యన్ జాతీయులతో కలిసి హోటల్ ల్ బస చేశాడు. హోటల్ గదిలోని మూడవ అంతస్తు నుంచి అతను ప్రమాదవశాత్తు పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతని ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల తర్వాత మరణించారు. ఉక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధంపై తీవ్ర విమర్శలు చేసిన పావెల్ ఆంటోవ్ మరణంపై పలు ఆరోపణలు వచ్చాయి.

అపస్మారక స్థితి
అతను తన స్నేహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్, మరో ఇద్దరు రష్యన్ జాతీయులతో కలిసి హోటల్ ల్ బస చేశాడు. హోటల్ గదిలోని మూడవ అంతస్తు నుంచి అతను ప్రమాదవశాత్తు పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతని ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల తర్వాత మరణించారు. ఉక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధంపై తీవ్ర విమర్శలు చేసిన పావెల్ ఆంటోవ్ మరణంపై పలు ఆరోపణలు వచ్చాయి.

రష్యా రాయబార కార్యాలయం
ఒడిశా పోలీసులు తమ ఇద్దరు పౌరుల హోటల్ మరణాలలో ఇంకా ఎలాంటి క్రిమినల్ లింక్ను కనుగొనలేదని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. భారత్ లో రష్యన్ల మృతి స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది.












Click it and Unblock the Notifications