Viral Video: రోడ్డుపై దొర్లుతూ నిరసన తెలిపిన సామాజిక కార్యకర్త.. వీడియో వైరల్..
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ప్రజల సమస్యసలను అస్సలు పట్టించుకోవడం లేదు. తమ సమస్యలపై సామాన్యులు ఎన్ని సార్లు విన్నవించిన అధికారులు పెడచెవిన పెడుతున్నారు. అందుకే ప్రజలు రూట్ మార్చారు. తమ సమస్యలను హైలెట్ చేయడానికి విభిన్న నిరసన పద్ధతులు ఫాలో అవుతున్నారు. తాజాగా కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి.

దెబ్బ తిన్న రోడ్లు
దీంతో ప్రజలు రోడ్లపై ప్రయాణించడానికి జంకుతున్నారు. ఉడిపిలో వర్షం కారణంగా దెబ్బ తిన్న రోడ్ల బాగు చేయాలని ఓ సామాజిక కార్యకర్త వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో బాబా ఏం చేశారంటే..

నిత్యానంద ఒలకడు
రోడ్ల పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఉడిపిలో ఒక సామాజిక కార్యకర్త బాబా వేషంలో దెబ్బ తిన్న రోడ్లపై పడుకుని పోర్లాడు. కమిటీ సభ్యుడు నిత్యానంద ఒలకడు రోడ్ల దయనీయ పరిస్థితిని మీడియా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ పని చేశాడు. ఇందుకు సంబంధిచిన వీడియోను మనోష్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాషాయ వస్త్రం
పోస్టుతో పాటు #ఉడిపిలో ఒక సామాజిక కార్యకర్త రోడ్ల దయనీయ పరిస్థితిని ఎత్తిచూపేందుకు గుంతలపై పడుకున్నాడు. ఉడిపి సివిక్ కమిటీ సభ్యుడు నిత్యానంద ఒలకడు కాషాయ వస్త్రం ధరించి ఈ పని చేశాడు. ఇంద్రాలి రైల్వే బ్రిడ్జి సమీపంలోని రోడ్లపై గుంతులు ఏర్పడ్డాయి.
15 వేలకు పైగా వ్యూస్
ఈ వీడియోకు ఇప్పటి వరకు 15 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 9 వందల మంది రీట్వీట్లు చేశారు. ఎన్ని చేసినా ప్రభుత్వాలు పట్టించుకోదు అని ఒకరు కామెంట్ చేశారు. ఉడిపిలో రోడ్లు దెబ్బ తిన్నాయి. త్వరగా రీపేర్ చేయాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.












Click it and Unblock the Notifications