ఆప్ ఎంఎల్ఏపై కాల్పులు: జస్ట్ మిస్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడిపై కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. శాసన సభ్యుడు వేద్ ప్రకాష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు.
వేద్ ప్రకాష్ కు ఈశ్వర్ కాలనీలో ఒక కార్యాలయం ఉంది. గురువారం రాత్రి వేద్ ప్రకాష్ తన కార్యాలయంలో ఉన్నారు. అర్దరాత్రి దాటిన తరువాత ఒక గంట సమయంలో వాహనంలో వెళ్లిన దుండగులు వేద్ ప్రకాష్ కార్యాలయంపై తుపాకులతో కాల్పులు జరిపారు.

తరువాత నిందితులు అక్కడి నుండి పరారైనారు. వేద్ ప్రకాష్ దాడి నుండి తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు జరిపిన కాల్పులలో ఎవ్వరు గాయపడలేదని పోలీసులు చెప్పారు.
రాజకీయ కక్షల కారణంగా దాడి జరిగిందా, వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. వేద్ ప్రకాష్ మీద కాల్పులు జరిపిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చెయ్యాలని ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications